యాప్నగరం

పాల కోసం వెళ్లి.. లాఠీ దెబ్బలకి యువకుడు మృతి.!

కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ పోలీసులు లాఠీలతో కొట్టడంతో యువకుడు మృత్యువాత పడిన ఘటన వెలుగుచూసింది. ఎక్కడా లాఠీ చార్జి జరగలేదని పోలీసులు చెబుతున్నారు.

Samayam Telugu 26 Mar 2020, 8:51 pm
పాల కోసం ఇంటి నుంచి బయటికెళ్లిన యువకుడు పోలీసు దెబ్బలకి మృత్యువాతపడిన విషాద ఘటన వెలుగుచూసింది. లాక్‌డౌన్ సమయంలో బయటికి వచ్చినందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసు దెబ్బల కారణంగానే యువకుడు మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌‌‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu death3


హౌరా జిల్లాకు చెందిన లాల్ స్వామి(32) అనే యువకుడు పాలు తెచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చాడు. లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. రోడ్డుపై గుమికూడిన యువకులను చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించడంతో స్వామికి తీవ్రగాయాలయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Also Read: ఖైదీకి కరోనా.. జైల్లో అల్లకల్లోలం.. పారిపోయిన మహిళా ఖైదీలు

పోలీసుల లాఠీ చార్జి కారణంగానే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఆరోపణలను హౌరా పోలీసులు ఖండించారు. ఎక్కడా లాఠీ చార్జి ఘటనలు చోటుచేసుకోలేదని.. అతను హార్ట్ ఫెయిలై చనిపోయినట్లు తెలుస్తోందని హౌరా సౌత్ డీసీపీ రాజు ముఖర్జీ అన్నారు. లాఠీ చార్జి ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

Read Also:
హోమ్ క్వారంటైన్‌లో ఉండమన్నందుకు దారుణం.. సొంతూరి వ్యక్తినే కొట్టి చంపేసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.