యాప్నగరం

పక్కోడికి సాయం చేయబోయి కొత్త పెళ్లికొడుకు మృతి.. నెల్లూరులో విషాదం

గత నెలలో అంకయ్యకి వివాహమైంది. పొలం పనులకు వెళ్లిన భర్త మరణించాడని తెలియడంతో భార్య గుండె పగిలిపోయింది. బురదలో ఇరుక్కుపోయిన యువకుడిని కూలీలు, రైతులు బయటికి తీశారు.

Samayam Telugu 22 Dec 2020, 5:11 pm
పక్కోడికి సాయం చేయబోయిన యువకుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి నెల రోజులు తిరక్కుండానే భర్త మరణించాడని తెలియడంతో ఆ భార్య హతాశురాలైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. మనుబోలు మండలం బండేపల్లికి చెందిన రాజయ్యకి ఒక్కగానొక్క కుమారుడు అంకయ్య(27). తమ పొలం సాగు చేసుకోవడంతో పాటు ట్రాక్టర్ ‌డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత నెల 21న గూడూరుకి చెందిన మౌనికతో అంకయ్యకి వివాహమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక  చిత్రం
death


రోజు మాదిరిగానే పొలం పనులకు వెళ్లిన అంకయ్య విగతజీవిగా మారాడు. తమ పక్క పొలం దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో ఇరుక్కుపోయింది. ట్రాక్టర్ నడిపే అనుభవం ఉండడంతో పక్క పొలం వారు అక్కడే ఉన్న అంకయ్యను సాయం కోరారు. సరేనన్న అంకయ్య ట్రాక్టర్‌ను బయటకు తీసే క్రమంలో తిరగబడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ట్రాక్టర్ బోల్తా కొట్టి మీద పడడంతో బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. వెంటనే సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు వచ్చి అంకయ్య మృతదేహాన్ని బయటికి తీశారు. పెళ్లైన నెలరోజులకే భర్త మరణంతో భార్య కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.