యాప్నగరం

నానమ్మని చంపేసిన మనవడు.. ఆస్తి తగ్గిందని.. రంగారెడ్డిలో దారుణం

ఆస్తి మేనత్తలకు కూడా పంచడం పద్నాలుగేళ్ల మనవడికి నచ్చలేదు. ఆస్తి అంతా తన తండ్రికే రాసివ్వాలని నానమ్మపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో..

Samayam Telugu 14 Jul 2020, 10:34 pm
మగబిడ్డతో సహా ఆడబిడ్డలకు ఆస్తిని పంచిందన్న కోపంతో వృద్ధురాలిని ఆమె మనవడు దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంకర్‌పల్లి మండలం ఎల్లవర్తికి చెందిన వృద్ధురాలికి ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయిపోయాయి. ఈ క్రమంలో తన ఆస్తిని కొడుకుతో సహా కూతుళ్లకు కూడా రాసి ఇచ్చింది. అది మనవడి(14)కి మింగుడుపడలేదు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ablaze


ఆస్తి అంతా తన తండ్రికి వస్తుందనుకుంటే నానమ్మ మేనత్తలకు కూడా రాసివ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కూతుళ్లకి ఇచ్చిన ఆస్తిని తన తండ్రి పేరిట రాసివ్వాలని వృద్ధురాలిపై ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో కోపంతో నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: డ్రైవర్‌తో కూతురి ప్రేమ.. తండ్రికి తెలిసిపోవడంతో..Also Read: లేడీ ఎస్సై వేధింపులు.? గుంటూరు యువకుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.