యాప్నగరం

విజయవాడ: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరింపులు

గవర్నర్‌పేట-1 డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిని.. అదే డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న అజయ్ కుమార్ వేధింపులకు గురి చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.

Samayam Telugu 11 Nov 2020, 12:51 pm
విజయవాడ సత్యనారాయణపురంలో ప్రేమ పేరిట బెదిరింపులు కలకలంరేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని యువతి ఇంటికే వెళ్లి కత్తితో బెదిరించాడో యువకుడు. గవర్నర్‌పేట-1 డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిని.. అదే డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న అజయ్ కుమార్ వేధింపులకు గురి చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.. ఈ విషయం తెలిసిన అజయ్ తనను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. బాధిత యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu విజయవాడ


విజయవాడలో ఇటీవలే దివ్య తేజస్విని హత్యకేసు కలకలంరేపిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంతోనే నాగేంద్ర అనే యువకుడు తేజస్విని కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది.. నిందితుడు కూడా గాయపడి రెండు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. ఆ ఘటన మరువక ముందే మళ్లీ యువతి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించడం సంచలన రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.