యాప్నగరం

Fact Check: అయోధ్య తీర్పు అనంతరం సోషల్ పోస్టులపై ప్రత్యేక నిఘా..!

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది. వివాదాలకు తావివ్వకుండా ధర్మాసనం తీర్పును వెల్లడించారు.

Samayam Telugu 11 Nov 2019, 7:30 pm
విషయం: దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య కేసు సమస్యకు సుప్రీంకోర్టు నవంబర్ 9న పరిష్కారం చూపించింది. అయితే అయోధ్య కేసు తీర్పు వెలువడిన అనంతరం సోషల్ మీడియా నియమాలు, నిబంధనలు మారిపోతున్నాయని ప్రచారం జరిగింది. ఈ మేరకు నెటిజన్లు ఈ నియమాలు తెలుసా, వీటిని పాటించాలని షేర్ చేశారు. ఈ క్రమంలో టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ రీడర్ నిజమేంటో తేల్చాలని కోరాడు.
Samayam Telugu Ayodhya verdict


ఇదే మెస్సేజ్ ఫేస్ బుక్‌, ట్విట్టర్ అకౌంట్లలోనూ వైరల్ అయింది.

నిజం: అయోధ్య తీర్పు అనంతరం సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని, రూల్స్ మారతాయనన్నది కేవలం వదంతులేనని అయోధ్య పోలీసులు ట్వీట్ చేశారు.

ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు యూపీ పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.

అయోధ్య పోలీసులు సైతం విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయవద్దని, సోషల్ మీడియాపై నిఘా అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక శాంతిపూర్వకంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని సూచించారు. విధ్వేషాన్ని పెంచే పోస్టులు చేస్తే ఐపీసీ 153ఏ సెక్షన్, ఐటీ చట్టం 66(ఏ) సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణిస్తామని అదే ట్వీట్ ద్వారా నెటిజన్లను హెచ్చరించారు.

ఐక్యమత్యంగా ఉండాలని, వదంతులు నమ్మవద్దని సీనియర్ ఎస్పీ ఆశిష్ తివారీ కోరిన బైట్‌ను అయోధ్య పోలీసులు ట్వీట్ చేశారు.

నిర్ధారణ: అయోధ్య కేసు తీర్పు అనంతరం సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందనడం, సోషల్ మీడియాలో కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్నది కేవలం వదంతులేనని టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
Read in ENGLISH

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.