యాప్నగరం

కరోనాను ఆపలేక చైనా 20 వేల మంది రోగులను చంపాలనుకుంటుందా?

ప్రాణాంతక కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో చైనా వణికిపోతోంది. వుహాన్ నగరంలో పరిస్థితి భయానకంగా ఉంది. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారి శ్మశాన నిశబ్దం అలుముకోగా.. ఆస్పత్రులు రోగులు, అనుమానితులతో కిక్కిరిసిపోయాయి. వైరస్‌ను కట్టడి చేయలేని పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందంటూ ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకంపనలు రేపుతోంది. కరోనా వైరస్ సోకిన 20 వేల మంది రోగులను చంపేయడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతి కోరిందని ఆ వార్త సారాంశం.

Samayam Telugu 7 Feb 2020, 8:46 pm
ప్రాణాంతక కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో చైనా వణికిపోతోంది. వుహాన్ నగరంలో పరిస్థితి భయానకంగా ఉంది. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారి శ్మశాన నిశబ్దం అలుముకోగా.. ఆస్పత్రులు రోగులు, అనుమానితులతో కిక్కిరిసిపోయాయి. వైరస్‌ను కట్టడి చేయలేని పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందంటూ ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకంపనలు రేపుతోంది. కరోనా వైరస్ సోకిన 20 వేల మంది రోగులను చంపేయడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతి కోరిందని ఆ వార్త సారాంశం.
Samayam Telugu fact check china seeking court approval to kill 20000 coronavirus patients
కరోనాను ఆపలేక చైనా 20 వేల మంది రోగులను చంపాలనుకుంటుందా?


అసలేం రాశారు?

కరోనా వైరస్‌ మరింత మందికి వ్యాపించకుండా చైనా ఈ సంచలన నిర్ణయం తీసుకుందంటూ ‘ab-tc.com’ అనే వెబ్‌సైట్‌లో వార్తా కథనం రాశారు. అంతేకాకుండా చైనా సుప్రీంకోర్టు కూడా అతి త్వరలోనే దీనికి అనుమతి ఇవ్వనుందని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్ సోకిన కొద్ది మంది రోగులు తమ ప్రాణాలను త్యాగం చేయకపోతే.. జనాన్ని, వైద్య సిబ్బందిని కాపాడుకోలేం. ప్రాణాంతక వైరస్‌తో పోరాడలేం’ అంటూ చైనా ప్రభుత్వం తమ పిటిషన్‌లో పేర్కొన్నట్లు రాసుకొచ్చారు. ఈ వార్తను చదివి చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం నీటి సమస్య కారణంగా 5 వేలకు పైగా ఒంటెలను చంపిన ఘటన నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ కంటే వేగంగా ఈ వార్త వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంత?

అసలు వాస్తవం ఏమిటి?

ఇంతటి సంచలన వార్తను ‘ab-tc.com’ వెబ్‌సైట్ ఓ స్థానిక మీడియా ప్రతినిధి వెల్లడించినట్లుగా రాసుకొచ్చింది. ఆ వార్తా కథనానికి ఆథర్ పేరు కూడా లేకపోవడం గమనార్హం. పోనీ.. ఆ వార్తను కల్పితమైనదిగా లేదా వ్యంగ్యాత్మకంగా రాశారా అంటే.. ఎక్కడా అలా ప్రస్తావించలేదు. ab-tc.com తప్ప ప్రపంచంలో ఏ మీడియా సంస్థ కూడా ఇలాంటి వార్తను ప్రచురించలేదు.

అతి ముఖ్యమైన విషయం ఇదే..

ab-tc.com ప్రచురించిన కథనాన్ని ధ్రువీకరించే విధంగా ఎలాంటి ఆధారాలు గానీ, అధికారుల స్పందన గానీ, అఫీషియల్ ట్వీట్లు గానీ ఆ వార్తలో ఎక్కడా లేవు. అత్యంత ప్రధాన విషయం ఏమిటంటే.. వార్త మొదటి వాక్యంలోనే చైనా స్పెల్లింగును తప్పుగా రాయడం గమనార్హం. "China"కు బదులు "Chhina"గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్తను నిరాధారమైందిగా భావించవచ్చు.

మరిన్ని వివరాలు..

టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ బృందం మరిన్ని వివరాల కోసం ఆరా తీయగా.. ab-tc.com వెబ్‌సైట్ గతంలో పలు ఫేక్ వార్తలు రాసినట్లు తేలింది. అసలు వెబ్‌సైట్‌లో తమ వివరాలు పొందుపరిచే ‘About us’ కాలమ్‌లో ఆ సంస్థకు సంబంధించి సరైన వివరాలే లేకపోవడం గమనార్హం. అటు చైనా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పరిశీలించగా.. అలాంటి పిటిషన్ ప్రస్తావనే లేదు.

వదంతులు వైరస్ కంటే డేంజర్

చైనాకు వెళ్లకుండానే సింగపూర్‌కు చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకిందంటూ జనవరి 30న ab-tc.com మరో కథనాన్ని ప్రచురించింది. దీనిపై సింగపూర్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏ ఆధారాలతో ఇలాంటి అసత్య వార్తను ప్రచురించారో వివరణ ఇవ్వాలని తన ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రశ్నించింది. కాబట్టి ఈ వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read This in English

Also Read: కంపెనీ సీఈవోతో ప్రేమలో.. ఆమెను ఎలాగైనా పొందాలనుకొని, చివరికి ట్విస్టు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.