యాప్నగరం

మధ్యప్రదేశ్‌లో హిందూ యువతి సజీవ దహనం.. వైరల్ వీడియో నిజమేనా?

మధ్యప్రదేశ్‌లో ఓ యువతిని సజీవ దహనం చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది అవాస్తవం. ఇది గ్వాటెమాలలో 2015లో జరిగింది.

Samayam Telugu 18 Dec 2018, 12:54 pm
ఓ యువతిని సజీవ దహనం చేస్తోన్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. చర్చిలో ప్రార్థనలకు హాజరైందనే కారణంతో మధ్యప్రదేశ్‌లో హిందూ అమ్మాయిని సజీవ దహనం చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. @javed655 పేరిట ఉన్న ట్విట్టర్ యూజర్ వీడియోను ట్వీట్ చేసి.. ‘క్రిస్టియన్ చర్చిలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నదని మధ్యప్రదేశ్‌లో ఓ హిందూ యువతిని సజీవ దహనం చేశారు. దయచేసి దీన్ని అందరికీ పంపించండి. దీనివల్ల ఇండియా వైపు ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఉంది. భూమిపై ఉన్న అసలైన నరకం ఇండియా. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ చండాలమైన ముఖాన్ని ఒకసారి చూడండి’ అంటూ పేర్కొన్నారు.
Samayam Telugu Fake_News


ఆ ట్వీట్ ఇదే..
గమనిక: వీడియోలోని దృశ్యాలు హింసాత్మకంగా ఉన్నాయి. వీక్షకుల సౌకర్యార్థం ముందుగా సూచిస్తున్నాం.
Hindu girl burnt alive in Madhya Pradesh because she attended a prayer meeting in a Christian church. Please send t… https://t.co/5QFQ3sBvo1
— javed (@javed655) 1544894550000

ఈ వీడియోను 2700కు పైగా ట్విట్టర్ యూజర్లు లైక్ చేశారు. సుమారు 3,700 మంది రీట్వీట్ చేశారు. ఇప్పటికే 80వేల సార్లకు పైగా చూశారు. ఒకవేళ ట్వీట్ మీకు కనిపించనట్లయితే ఇక్కడ క్లిక్ చేసి ఆర్కీవ్డ్ వర్షన్‌ను చూడొచ్చు.

ఇదే వీడియోను 2016లో చాలామంది పాకిస్థాన్ ట్విట్టర్ యూజర్లు ట్వీట్ చేశారు. క్రిస్మస్ సమయంలో ఈ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మళ్లీ ఇప్పుడు క్రిస్మస్ సమయంలోనే వైరల్ చేస్తున్నారు.
మచ్చుకి కొన్ని ట్వీట్లు:

అసలు నిజం ఇది..
అసలు ఈ వీడియో భారత్‌కు సంబంధించినదే కాదు. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలలో 2015లో జరిగింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ తీసిన వీడియోను 2017లో తప్పుడు ప్రచారం చేశారు. మార్వాడి అమ్మాయిని ముస్లిం మూక హత్యచేసిందని వీడియోను సర్క్యులేట్ చేశారు.

ధ్రువీకరణ, పరిశోధన విధానం
‘woman burnt alive public’ అనే కీవర్డ్స్‌తో గూగుల్ సెర్చ్ చేస్తే అసలు నిజమేంటో అందరికీ తెలిసిపోతుంది. ఈ కీవర్డ్స్‌తో గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చిన ఫలితాలతో కూడిన స్క్రీన్‌షాట్ ఇదిగో..

ఇంతకీ అసలు నిజం ఏంటంటే.. గ్వాటెమాలలోని రియో బ్రావో అనే గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయిని 2015లో సజీవ దహనం చేశారు. 68 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ హత్యతో ఆ అమ్మాయికి సంబంధ ఉందనే ఆరోపణతో ఆమెను నడిరోడ్డుపై చంపేశారు. అప్పటి ఈ వీడియోను తీసుకొని ప్రస్తుతం ట్విట్టర్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారు. "girl burnt alive guatemala" అనే కీవర్డ్స్‌తోనూ మేం గూగుల్‌లో సెర్చ్ చేశాం. అప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు ప్రత్యక్షమయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న తప్పుడు వీడియో ఫ్రేమ్స్‌తో మేం సెర్చ్ చేసిన ఇమేజ్‌లు మ్యాచ్ అవుతున్నాయి. వైరల్ అవుతోన్న వీడియో కచ్చితంగా గ్వాటెమాల సంఘటనదే అని స్పష్టమవుతోంది.

చివరిగా..
మధ్యప్రదేశ్‌లో హిందూ అమ్మాయిని సజీవ దహనం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో పూర్తిగా అబద్ధం. దయచేసి దీని బారిన పడకండి.. షేర్లు, రీట్వీట్లు అస్సలు చేయకండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.