యాప్నగరం

Fact Check: ఆర్టికల్ 370 రద్దు.. అక్కడ జమ్మూకాశ్మీర్ జెండా తొలగించారా?

Jammu Kashmir Flag Removed | జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దయిపోయింది. రాష్ట్రం నుంచి లడఖ్‌ను వేరు చేయడంతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాపై వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

Samayam Telugu 12 Aug 2019, 7:43 pm

ప్రధానాంశాలు:

  • జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రత్యేక జెండా వినియోగంపై అనుమానాలు
  • ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ జెండా తొలగించారని ప్రచారం
  • శ్రీనగర్ సెక్రటెరియట్‌పై త్రివర్ణ పతాకమే ఉందని నెటిజన్ల పోస్టులు
  • టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ దీనిపై పరిశీలించి అసలు నిజాలు వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jammu Kashmir
విషయం
ఆర్టికల్‌ 370ని రద్దుచేసి జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర స్వతంత్ర ప్రతిపత్తికి కేంద్రం ఇటీవల స్వస్తి పలికిన విషయం తెలిసిందే. అయితే అది మొదలుకుని రోజూ ఏదో ఓ విషయమే జమ్మూకాశ్మీర్‌ వార్తల్లో నిలుస్తోంది. శ్రీనగర్‌లోని సెక్రటేరియట్‌ భవనంపై జమ్మూకాశ్మీర్‌ పతాకాన్ని తొలగించారని ప్రస్తుతం భారత జాతీయ పతాకమే అక్కడ రెపరెపలాడుతుందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ విషయం వైరల్‌ అవుతోంది.
టైమ్స్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ రీడర్‌ జమ్మూ పతాకం నిజంగానే తొలగించారా.. నిజమేంటో చెప్పాలని వాట్సాప్‌ నెంబర్‌ 8527001433కి ఫొటో షేర్‌ చేశాడు.
నిజం
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర ప్రత్యేక జెండా శ్రీనగర్‌లోని సచివాలయంపై ఇంకా ఎగురుతూనే ఉంది. భారత జాతీయ పతాకం సైతం ఆ భవనంపై నేటికీ రెపరెపలాడుతోంది. త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక జెండాను తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. భారత క్రీడాకారిణి గీతా ఫొగట్‌ సైతం ఇది నిజమని నమ్మారు.
పరిశీలన
రెండు జెండాలు కనిపిస్తున్న ఫొటోతో రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయగా కాశ్మీర్‌ న్యూస్‌ అబ్జర్వర్‌ నవంబర్‌ 2016లో ఇదే ఫొటోను పోస్ట్‌ చేసినట్లు గుర్తించవచ్చు. ప్రస్తుతం షేర్‌ అవుతున్న ఫొటో ఆర్టికల్‌ 370 రద్దుచేసిన తర్వాత తీసింది కాదు.
దీనిపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా శ్రీనగర్‌ రిపోర్టర్‌ సలీం పండిత్‌ను టైమ్స్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ సంప్రదించింది. శ్రీనగర్‌ సెక్రటెరియట మీద రెండు జెండాలు ఎగుతున్నాయని, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కేవలం జాతీయ జెండా ఫొటో నిజం కాదని చెప్పారు. కాశ్మీర్‌ ఫ్లాగ్‌ అని గూగుల్‌లో సెర్చ్‌చేస్తే ఏఎన్‌ఐ మీడియా ట్వీట్‌ కనిపిస్తుంది. ఆర్టికల్‌ 370 రద్దయి, జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం సైతం త్రివర్ణ పతాకంతో పాటు జమ్మూకాశ్మీర్‌ పతాకం శ్రీనగర్‌ సెక్రటెరియట్‌పై ఎగురుతోందని ఆగస్టు 7న ఏఎన్‌ఐ ఓ వీడియోను షేర్‌ చేసింది.
నిర్ధారణ
జమ్మూకాశ్మీర్‌ జెండాను సివిల్‌ సెక్రటేరియట్‌ మీద ఇదివరకే తొలగించారన్నది నిజం కాదని టైమ్స్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ గుర్తించింది. కేవలం జాతీయ పతాకం అక్కడ ఎగురుతున్నట్లు షేర్‌ అవుతున్నది మార్ఫింగ్‌ ఫొటో అని తెలుస్తోంది.
Read this story in ENGLISH

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.