యాప్నగరం

Fact Check: రేషన్ కార్డులపై Jesus image.. వైఎస్ జగన్‌పై విమర్శలు.. నిజమేంటి!

విషయం: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలకు దారి తీసింది. రేషన్ కార్డులపై జగన్ ప్రభుత్వం ఏసుక్రీస్తు ఫొటోను ముద్రించిందని, లిక్కర్ కార్డులపై సైతం ఇలాంటి ఫొటోనే చూడాల్సి వస్తుందా అని ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

Samayam Telugu 14 Dec 2019, 6:35 pm
విషయం: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలకు దారి తీసింది. రేషన్ కార్డులపై జగన్ ప్రభుత్వం ఏసుక్రీస్తు ఫొటోను ముద్రించిందని, లిక్కర్ కార్డులపై సైతం ఇలాంటి ఫొటోనే చూడాల్సి వస్తుందా అని ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
Samayam Telugu no ys jagan mohan reddy government not issued ration cards with jesus image
Fact Check: రేషన్ కార్డులపై Jesus image.. వైఎస్ జగన్‌పై విమర్శలు.. నిజమేంటి!


రేషన్ డీలర్ నిర్ణయం

నిజం: ప్రస్తుతం వైరల్ అవుతున్నది ఏపీకి సంబంధించిన రేషన్ కార్డు ఫొటో. కానీ ఆ కార్డును ఏపీ ప్రభుత్వం ముద్రించి రేషన్ డీలర్లకు అందించిందని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి అది రేషన్ డీలర్ సొంతంగా ముద్రించిన రేషన్ కార్డు. గతంలో హిందూ దేవుళ్ల ఫొటోలతో సైతం రేషన్ డీలర్ కార్డులు ముద్రించి తన రేషన్ షాపులో సరుకులు తీసుకెళ్లే వారికి ఇచ్చారని సమాచారం.

​పరిశీలన

రేషన్ కార్డులపై జీసస్ ఫొటో విషయంపై గూగుల్‌లో వెతకగా ఆసక్తికర అంశాలు తెలిశాయి. తూర్పుగోదావరి జిల్లా వడ్లమూరులోని ఓ రేషన్ దుకాణంలో డీలర్ ఈ విధంగా రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు ఫొటో ముద్రించారని స్పష్టమైంది. ‘ప్రతి ఏడాది దేవుడి ఫొటోలతో రేషన్ కార్డులు ముద్రిస్తాం. వినియోగదారుల నుంచి రూ.5మేర తీసుకుంటాం. అయితే ఈ ఏడాది ఏసుక్రీస్తు బొమ్మ ముద్రించాం. ఏపీ ప్రభుత్వానికి, ఈ రేషన్ కార్డుకు ఏ సంబంధం లేదని’ రేషన్ షాపు డీలర్ భర్త సత్య సాయిరాం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. (Photo Credit/indiatoday.in)

Fact Check: అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంబానీ రూ.500 కోట్లు ఇచ్చారా?

ప్రభుత్వ నిర్ణయం కాదు

నిర్ధారణ: రేషన్ కార్డులపై జీసస్ ఫొటోలు ముద్రించడం అనేది వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయం కాదని, ఓ రేషన్ డీలర్ ఆ కార్డులు చేపించారని స్పష్టమైంది. గతంలో హిందూ దేవుళ్ల ఫొటోలు ముద్రించామని, ప్రస్తుతం జీసస్ ఫొటోను ముద్రించినట్లు రేషన్ డీలర్ భర్త మీడియాతో మాట్లాడటం తెలిసిందే.

Fact Check: ముంబైలోని Shiv Sena భవన్‌పై సోనియా గాంధీ ఫొటోనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.