యాప్నగరం

సునంద మృతికి కారణాలు తెలియవట

మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది.

TNN 28 Jan 2017, 5:47 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ఘటన జరిగింది. ఆమెది హత్యా లేక ఆత్మహత్య అన్నది ఇంతవరకు తేలలేదు. ఆమె మృతి కేసు తేల్చడానికి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కూడా వేసింది. సిట్ అధికారులు అన్ని రకాలు దర్యాప్తు చేసినప్పటికీ ఎక్కడా ఇంత క్లూ కూడా దొరకలేదు. ఆమె పోస్టు మార్టం రిపోర్టులో అల్ర్పైక్స్ అనే డ్రగ్ ఉన్నట్టు తేలింది. శరీరంలోని డ్రగ్ తాలూకు శాంపిళ్లను ఎయిమ్స్ ల్యాబ్ లో కూడా టెస్టులు చేశారు. అయినా కూడా ఆమె మృతికి అసలైన కారణం తెలియదంటూ మెడికల్ బోర్డు సిట్ అధికారులకు అందించింది. ఢిల్లీ, ఛండీఘడ్, పుదుచ్చేరికి చెందిన వైద్యాధికారులతో మెడికల్ బోర్డును నియమించింది ప్రభుత్వం.
Samayam Telugu  medical board fails to make any conclusion in report on sunandas death
సునంద మృతికి కారణాలు తెలియవట


మెడికల్ బోర్డు చేతులెత్తేయడంతో పోలీసులు మరో కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. సునంద ఫోన్ లో డిలీట్ చేసిన మేసేజ్ లను తిరిగి రీస్టోర్ చేసే పనిలో ఉన్నారు. చనిపోవడానికి ముందు ఆమె ఎవరితో చాటింగ్ చేసిందో తెలిస్తే కాస్త కేసు ముందుకు కదులుతుందని పోలీసులు భావిస్తున్నారు.

సునందకు చెందిన శరీరంలోని శాంపిళ్లను అమెరికాలోని ఎఫ్‌బీఐ ల్యాబ్‌కు కూడా పంపారు. వారి రిపోర్టును కూడా పోలీసులు అడిగారు. ఆ రిపోర్టు కూడా వస్తే కోర్టులో దాఖలు చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.