యాప్నగరం

పెళ్లి విందులో కొట్లాట.. ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

పెళ్లి వేడుక సందడిగా సాగుతోంది. వచ్చి వెళ్లే అతిథులతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇంతలోనే అనుకోని అలజడి.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఓ యువకుడి నిండు ప్రాణం బలికాగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 25 Jun 2018, 1:04 pm
పెళ్లి వేడుక సందడిగా సాగుతోంది. వచ్చి వెళ్లే అతిథులతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇంతలోనే అనుకోని అలజడి.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఓ యువకుడి నిండు ప్రాణం బలికాగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారణం ఏంటా అని ఆరా తీసిన వారికి దిమ్మ తిరిగింది. ఇంత చిన్న విషయానికి కూడా ఓ మనిషి ప్రాణాలు తీసే వరకు వెళతాయా అని ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది. యూపీలోని బాలియా జిల్లా విక్రమ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.
Samayam Telugu Wedding Fight


విక్రమ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన అతిథులు భోజనం చేసేందుకు వెళ్లారు. అప్పటికే కొంతమంది విందు ఆరగిస్తున్నారు. ఇంతలో అతిథులు భారీగా రావడంతో.. వడ్డించేందుకు ప్లేట్లు లేకుండా పోయాయి. అంతా గందరగోళ వాతావరణం నెలకొంది. కొంతమంది ప్లేట్ల కోసం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. వారి మధ్య మాటా మాట పెరిగి పరిస్థితి తోపులాట వరకు వెళ్లింది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న వంట సామాను తీసుకొచ్చి.. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

ఈ ఘర్షణలో విశాల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో నలుగుర్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవకు కారణంపై ఆరా తీసి.. ప్రత్యక్ష సాక్షుల నుంచి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.. కొందర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అప్పటి వరకు పెళ్లి వేడుకతో సందడిగా కనిపించిన వాతావరణం.. యువకుడి మృతితో ఉన్నట్టుండి విషాదంగా మారిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.