యాప్నగరం

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

దసరా కావడంతో దుర్గమ్మ దర్శనానికి వెళ్లొస్తుండగా వెంటాడిన మృత్యువు.. 10మంది అక్కడికక్కడే మృతి.. బాధితులంతా దగ్గరి బంధువులే..

Samayam Telugu 17 Oct 2018, 11:18 am
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నౌపదా జిల్లాలోని సిల్దా సమీపంలో హైవేపై బొలేరో-లారీని ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే చనిపోయారు. బొలేరోలో ప్రయాణిస్తున్నవారు దసరా కావడంతో మంగళవారం ఒడిశాలోని కోమ్నాకు వెళ్లారు. అక్కడి వైష్ణవీ దేవిని దర్శించుకొని బుధవారం తిరిగి తమ సొంత ఊర్లకు బయల్దేరారు. బొలేరో సరిగ్గా సిల్దా దగ్గరకు రాగానే ప్రమాదం జరగ్గా.. ప్రమాదంలో బొలేరో మొత్తం నుజ్జు, నుజ్జయ్యింది.
Samayam Telugu Odisha.


వాహనంలోని 10మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో నలుగురు, మరో ముగ్గురు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా చెబుతున్నారు. ప్రమాదం వేకువ జామున మూడు గంటలకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే లారీని ఢీకొట్టిందంటున్నారు. ప్రమాదంలో రెండు కుటుంబాలు చనిపోవడంతో.. విషాదం ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.