యాప్నగరం

ఆ ప్రధాని ఇంటిపేరు అలా మారింది

అక్టోబర్ 2.. మహాత్మ గాంధీ జయంతి అని అందరికీ తెలుసు. అలాగే మరో మహానుభావుడు కూడా ఇదే రోజున జన్మించారు.ఆయనే లాల్ బహదూర్.

TNN 2 Oct 2016, 3:21 am
అక్టోబర్ 2.. మహాత్మ గాంధీ జయంతి అని అందరికీ తెలుసు. అలాగే మరో మహానుభావుడు కూడా ఇదే రోజున జన్మించారు. ఆయనే లాల్ బహదూర్. ఈయన పేరు చివరలో శాస్త్రి రావడానికి ఒక కారణం ఉంది. శాస్త్రి అనేది కాశీ విద్యాపీఠం ఇచ్చిన బిరుదు. వాస్తవానికి లాల్ బహదూర్ ఇంటిపేరు శ్రీవాత్సవ. ఉత్తరప్రదేశ్ లో జన్మించిన లాల్ బహదూర్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి తో సహా బీదరికంలో తన జీవితాన్ని నెట్టుకొచ్చాడు. తాను కులమతాలకి అతీతంగా ఉండాలనే భావంతో శ్రీవాత్సవ అనే తన ఇంటి పేరుని సైతం ఎప్పుడూ వాడని సమతా వాది. తన చిన్నప్పుడు చదువుకునేందుకు రోజూ నదిని ఈదుతూ పాఠశాలకు వెళ్లేవారు. స్వాతంత్ర్య సమరం లో పాల్గొనటానికి చదువును సైతం వొదులుకున్నాడు. అనేక ఉద్యమాల్లో పాల్లొన్నాడు. జైలు జీవితం గడిపాడు. 1927లో లాల్ బహదూర్ మీర్జాపూర్ కు చెందిన లలితాదేవిని పెళ్ళి చేసుకున్నారు.
Samayam Telugu 10 things you must know about former prime minister lal bahadur shastri
ఆ ప్రధాని ఇంటిపేరు అలా మారింది


దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఉత్తర ప్రదేశ్ లోని అప్పటి ముఖ్యమంత్రి గోవింద వల్లభ పంత్ కు పార్లమెంటరీ సెక్రటరీగా తన కెరీర్ ప్రారంభించాడు. తర్వాత తన రాజకీయ జీవితంలో అంచెలంచలుగా ఎదిగాడు. తన నిజాయితీతో, నిబద్ధతతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా, హోం శాఖామంత్రిగా, ఆ తర్వాగా నెహ్రూ కేబినెట్ లో రైల్వేశాఖ మంత్రిగా చేశారు. 1964లో నెహ్రూ అకాల మరణంతో శాస్త్రి భారత ప్రధానిగా పదవీ బాధ్యతులు చేపట్టారు. 1965 లో పాకిస్థాన్ తో యుద్ధం వచ్చిన సమయంలో తన శక్తి ఏమిటో చూపించాడు. అంతకు ముందు దాకా అక్కర్లేని శాంతి వచనాలతో దేశాన్ని నిర్వీర్యం చేసిన స్థితి నుంచి దేశాన్ని ఉత్తేజం దిశగా, ఉత్సాహం దిశగా ఉరకలెత్తించాడు. జై కిసాను.. జై జవాను అంటూ నినదించి దేశానికి దిశానిర్దేశనం చేశాడు. 1966 జనవరి 11వ తేదీన తాష్కెంట్ ఒప్పందం కోసం రష్యా వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌ లోనే మరణించారు. తాష్కెంట్ ఒప్పందంపై చేసిన సంతకం తడి కూడా ఆరక ముందే లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన శరీరం రంగు నీలి రంగులోకి మారిపోయింది. శరీరంపై తెల్లటి మచ్చలు కూడా ఏర్పడ్డాయి. భారత ప్రధాని బస చేసిన హోటల్ రూం నుంచి ఆయన పర్సనల్ డైరీని మాయం చేశారు. కానీ అధికారికంగా లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించారని ప్రకటించారు. శాస్త్రిది సహజమరణం అనిపించడం లేదని ఆయన భార్య అనుమానించినా లాభం లేకుండా పోయింది. భారత ప్రధాని అనుమానాస్పద స్థితిలో చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా జరిపించలేదు. లాల్ బహదూర్ మమరణం తర్వాత దుర్భర పరిస్థితుల్లో ఆయన భార్య లలితా శాస్త్రి గడిపారు.లాల్‌బహదూర్‌ శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కుమారులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. శాస్త్రి మరణించాక దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు లాల్ బహదూర్ కుటుంబానికి మనీఆర్డర్ చేశారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.