యాప్నగరం

అక్రమ సంబంధం.. బాలుడి హత్య

వివాహేతర సంబంధం కారణంగా బాలుడిని అపహరించి హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

TNN 2 Mar 2018, 10:27 am
వివాహేతర సంబంధం కారణంగా బాలుడిని అపహరించి హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీఆర్‌ నగర్‌ సమీపంలో నేసపాకం భారతి నగర్‌కు చెందిన కార్తికేయన్‌ కుమారుడు రితేశ్ సాయి (10) అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం హిందీ ట్యూషన్‌కి వెళ్లిన రితేష్‌సాయి రాత్రి 8.30 అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కార్తికేయన్‌ ఎంజీఆర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భార్య మంజులకు సేలయూర్‌‌ ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నాగరాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కార్తికేయన్ తెలిపాడు. తన కుమారుడిని అతడే కిడ్నాప్‌ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు.
Samayam Telugu 10 year old boy kidnapped murdered by mothers paramour
అక్రమ సంబంధం.. బాలుడి హత్య


నాగరాజు మొబైల్‌ను ట్రేస్‌చేసిన పోలీసులు వేలూరులో ఉన్నట్లు గుర్తించి, గురువారం ఉదయం అరెస్టు చేసి విచారించారు. తంబారం-సేలయూర్ రోడ్డు సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవంతిలో తీవ్రగాయాలతో రితేశ్ సాయి విగతజీవిగా పడి ఉన్నాడు. సాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం క్రోమ్‌పేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీఎన్‌ఈబీలో ఉద్యోగినిగా విధులు నిర్వహించే మంజులకు నాగరాజుతో పరిచయం ఏర్పడి క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి సంబంధం గురించి భర్త కార్తికేయన్‌కు నాలుగు నెలల కిందట తెలియడంతో మందలించాడు. అయినా సరే వీళ్లు వినిపించుకోలేదు. దీనిపై జనవరిలో పోలీసులకు కార్తికేయన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును పిలిపించి హెచ్చరించారు. దీంతో అక్కసు పెంచుకున్న నిందితుడు రితేశ్ సాయిని అపహరించి హత్య చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.