యాప్నగరం

సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచేందుకు ప్రాధాన్యమిస్తోన్న..

TNN 20 Jun 2016, 4:53 pm
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచేందుకు ప్రాధాన్యమిస్తోన్న మోదీ ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయాన్నే తీసుకుంది. అత్యంత కీలమైన రక్షణ రంగంతోపాటు మరికొన్ని రంగాలకు సంబంధించిన వివాదాస్పద నిర్ణయాన్ని చడీచప్పుడు లేకుండా ప్రకటించేసింది. రక్షణ, విమానయాలన రంగాల్లో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నట్లు జూన్ 20న ప్రభుత్వం ప్రకటించింది. ఫార్మా సెక్టార్లోకి 74 శాతం వరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో 49 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతించేవారు.
Samayam Telugu 100 fdi in defence sector
సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్!

కేంద్రం నిర్ణయంతో విదేశీ ఆయుధ కంపెనీలు భారత్‌కు వరుసకట్టే అవకాశం ఉంది. ఆయా కంపెనీలు ఇక్కడ చిన్నతరహా ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారుచేసుకునే వీలుంటుంది. విమానయాన, ఫార్మా రంగాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రక్షణ రంగంలో ఎఫ్ డీఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం-1959కి సవరణలు చేసింది. గత యూపీఏ హయాంలోనే ఈ ప్రక్రియకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. కీలకమైన రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించడం సరికాదని ఆందోళనలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు మంజూరు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.