యాప్నగరం

Mid Day Meal: మధ్యాహ్న భోజనంలో పాము.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

Mid Day Meal: పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కాంట్రాక్టర్ ద్వారా ఈ భోజనం సరఫరా అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఆహారం వడ్డిస్తుండగా.. ఓ పిల్లాడు ప్లేటులో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. దీంతో ఆ విద్యార్ధి కేకలు వేస్తూ పాము పిల్ల ఆహారంలో ఉందని అప్రమత్తం చేశాడు. అయితే, అప్పటికీ 100 మందికి పైగా పిల్లలు తినేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 May 2023, 10:25 am
పాము పడిన మధ్యాహ్న భోజనం తిని 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలకలం రేపిన ఈ ఘటన బిహార్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. అరారియా జిల్లా ఫర్‌బిస్‌గంజ్ సబ్-డివిజన్ పరిధిలోని జోగ్‌బాని నగర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో బాధిత విద్యార్థులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు పేర్కొన్నారు. జోగ్‌బనీ నగర్ 21 వార్డులోని అమునా మిడిల్ స్కూల్‌‌లో విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము కనిపించింది.
Samayam Telugu Mid Day Meal


మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారుల్లో చాలామంది వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే, ఆ ఆహారం స్కూల్‌లో వండలేదని, ఓ కాంట్రాక్టర్ తీసుకొచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులంతా అస్వస్థతకు గురికావడంతో వారిని ఫర్‌బిస్‌గంజ్ సబ్-డివిజినల్ ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని స్థానిక డీఈఓ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఓ స్వచ్ఛంద సంస్థకు మధ్యాహ్న భోజన బాధ్యతలను అప్పగించామని, ఘటనలో వారి పాత్ర ఉన్నట్టు తెలితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విద్యార్ధులకు ఆహారం వడ్డిస్తుండగా.. అందులో పాము ఉండటం ఓ చిన్నారి చూసి అందర్నీ అప్రమత్తం చేశారు... అప్పటికే 100 మంది విద్యార్థులు తిన్నారు. వాంతులు చేసుకున్న విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న డీఈఓ, ఇతర అధికారులు.. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.

పిల్లలకు నాణ్యతలేని ఆహారం తీసుకొస్తున్నారని, గతంలో చాలాసార్లు ఎన్‌జీఓకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. అయితే, ఆహారంలో చనిపోయిన పాము ఎలా పడింతో తమకు తెలియదని సదరు ఎన్‌జీఓ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.