యాప్నగరం

షాకింగ్.. 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్

Mumbai Airport | 11 మంది జవాన్లు కరోనా బారిన పడ్డారని సీఐఎస్ఎఫ్ ప్రకటించింది. వీరంతా ముంబై ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తించే వారని తెలిపింది.

Samayam Telugu 3 Apr 2020, 8:02 pm
ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా రాకపోకలు సాగించారు. దీంతో ముందు జాగ్రత్తగా 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను గత కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంచారు. వీరిలో నలుగురికి గురువారం పాజిటివ్ రాగా.. మిగతా ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ఎఫ్ ప్రకటించింది.
Samayam Telugu cisf india


వీరికి ప్రయాణికుల నుంచి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఐడీ కార్డులను తాకడం, వాష్ రూమ్‌లలో నీళ్ల ట్యాప్‌లను ముట్టుకోవడం వల్ల వీరికి కోవిడ్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.

ముందుగా ఓ జవాన్‌కు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ రాగా.. మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగటివ్ అని వచ్చింది. దీంతో మూడోసారి అతడి శాంపిళ్లను టెస్టులకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని.. అతడ్ని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచినట్లు సీఐఎస్ఎఫ్ తెలిపింది.

జవాన్లు కోవిడ్ బారిన పడటం పట్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా స్పందించింది. ముందుండి దేశాన్ని రక్షించే సైనికులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వీప్‌మెంట్ (పీపీఈ) - మాస్కులు, హజ్మత్ సూట్లు, గ్లోవ్స్ అందించాలని ప్రధాని మోదీకి ఆలిండియా మహిళా కాంగ్రెస్ సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.