యాప్నగరం

వంతెనపై నుంచి పడిన బస్సు: 12 మంది మృతి

బీహార్‌లో శనివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు.

Samayam Telugu 17 Mar 2018, 9:35 pm
పాట్నా: బీహార్‌లో శనివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. సీతారామర్హి జిల్లాలోని రున్ని సైద్‌పూర్‌ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి.. వంతెన మీద నుంచి నీళ్లులేని కాలువలో పడిపోయింది. ప్రమాదం దాటికి బస్సు పూర్తిగా తిరగబడి ధ్వంసమైంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.