యాప్నగరం

చత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్: 12 మంది మావోయిస్టులు హతం

చత్తీస్‌గఢ్‌లో పోలీసులకి, మావోయిస్టులకి మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లా ఆకాబీడ..

Samayam Telugu 7 Feb 2017, 1:11 pm
చత్తీస్‌గఢ్‌లో పోలీసులకి, మావోయిస్టులకి మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లా ఆకాబీడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. చత్తీస్‌గఢ్‌లో గత వారం మావోయిస్టులు ల్యాండ్ మైన్‌తో పోలీసు వాహనం పేల్చేసిన ఘటనలో 10 మంది జవాన్లు మృతిచెందారు.
Samayam Telugu 12 maoists died during encounter in chhattisgarh
చత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్: 12 మంది మావోయిస్టులు హతం


అప్పటినుంచి చత్తీస్‌గఢ్ అడవుల్ని జల్లెడ పడుతూ కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకి మంగళవారం ఉదయం ఆకాబీడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు, పోలీసులకి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లోనే 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.