యాప్నగరం

తీవ్రగాయాలతో మరో ఏనుగు మృతి.. ఈసారి తమిళనాడులో

పేలుడు పదార్థాలతో కూడిన పండును తిని గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. మూగజీవాల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

Samayam Telugu 22 Jun 2020, 12:24 pm
కేరళలో పేలుడు పదార్థాలతో ఉన్న పండు తిని గర్భిణి ఏనుగు మృతిచెందిన ఘటన మరుకముందే.. తమిళనాడులో మరో ఏనుగు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన నోటి గాయాలతో బాధపడుతున్న మగ ఏనుగు సోమవారం ఉదయం చనిపోయింది. కొద్ది రోజుల కిందట కోయంబత్తూరు శివారులోని జంబుకండీ గ్రామంలో నోటి గాయాలతో బాధపడుతున్న ఏనుగును గుర్తించిన అధికారులు.. దానిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Samayam Telugu తమిళనాడులో ఏనుగు మృతి
injured Elephant death


‘గత రెండు రోజుల నుంచి ఏనుగు నోటి గాయంతో బాధపడుతుంది. దాన్ని రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫలించలేదు.. మరణానికి గల కారణాలపై విచారణ ప్రారంభించాం’అని అటవీ అధికారులు తెలిపారు. వెదురు పొదలను తినడం వల్లే ఏనుగు నోటికి గాయమైందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అయితే, పేలుడు పదార్థాలతో కూడిన ఆహారం వల్లే ఏనుగు గాయపడిందని స్థానికులు పేర్కొంటున్నారు. రెండు రోజుల కిందటే తీవ్ర గాయంతో ఉన్న ఏనుగును అధికారులు గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ఏనుగు చనిపోయింది.

కాగా, కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ రాష్ట్రంలో గజరాజులకు శాపంగా మారుతోంది. రెండున్నర నెలల వ్యవధిలో పెద్ద సంఖ్యలో ఏనుగులు మృతిచెందడం ఇందుకు నిదర్శనం. అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు గుర్తించి, వాటిని రక్షించేందుకు అటవీశాఖ అమలుచేస్తున్న గజబంధు పథకం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వేటగాళ్లకు వరంగా మారుతోంది.

చత్గీస్‌గఢ్‌లోని కేంఝర డివిజన్‌ పరిధిలో అత్యధికంగా నాలుగు ఏనుగులు మృతిచెందగా, ఐదు రోజుల క్రితం చంపువా అటవీ ప్రాంతంలో దంతాలు పీకేసి ఉన్న రెండు ఏనుగుల కళేబరాలను అటవీ అధికారులు గుర్తించారు. అక్కడికి రెండు రోజుల తర్వాత బౌద్ధ్‌ జిల్లా మాధాపూర్‌ రేంజ్‌ పరిధి ముండేశ్వర్‌ అటవీ ప్రాంతంలో ఈనెల 17న బుల్లెట్‌ గాయాలతో ఓ ఏనుగు పడి ఉన్న ఘటన చోటు చేసుకోవడం చూస్తే వన్యప్రాణుల పట్ల వేటగాళ్లు ఎంతటి కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.