యాప్నగరం

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి తరవాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు.

TNN 29 Dec 2017, 8:44 am
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి తరవాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. లోయర్ పారెల్‌లోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో ఉన్న ఓ భవనం పైభాగంలో ఉన్న పబ్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరైన వాళ్లు అగ్నికి ఆహుతయ్యారు.
Samayam Telugu 14 dead several injured in massive fire at mumbais kamala mills
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం: 14 మంది మృతి


పుట్టినరోజునాడే దారుణం..
రూఫ్-టాప్ రెస్టారెంట్ అయిన మోజోస్ పబ్‌లో ఓ 28 ఏళ్ల మహిళ తన పుట్టినరోజు వేడుకను ఏర్పాటుచేశారు. ఆ వేడుకకు చాలా బంధుమిత్రులు హాజరయ్యారు. అంతా పుట్టినరోజు వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు. సుమారు అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 30 నిమిషాల్లో మంటలు రెస్టారెంట్ మొత్తాన్ని వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్(కేఈఎం) హాస్పిటల్‌చు తరలించారు. మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది చనిపోయినట్లు కేఈఎం హాస్పిటల్ డీన్ డాక్టర్ అవినాష్ సూపే వెల్లడించారు. మరో 12 మంది గాయపడినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన కమలా మిల్స్ ప్రాంతం ప్రముఖ ఇండస్ట్రియల్ కాంపౌండ్. ఇక్కడ నివాసాలతో పాటు రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య కార్యాలయాలు అధికంగా ఉన్నాయి. పలు మీడియా సంస్థలకు చెందిన కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యూస్ ఛానెళ్లు టైమ్స్ నౌ, ఈటీ నౌతో పాటు మరో జాతీయ న్యూస్ ఛానెల్ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.