యాప్నగరం

కర్ణాటకీయంలో భారీ ట్విస్ట్.. 14మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు

యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షవెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్పీకర్ రమేష్‌కుమార్ భారీ షాకిచ్చారు. 14మంది రెబెల్ ఎమ్మెల్యేలపైఅనర్హత వేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. దీంతో అనర్హత వేటు పడిన సభ్యుల సంఖ్య 17కి చేరింది.

Samayam Telugu 28 Jul 2019, 12:40 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక స్పీకర్ రమేష్‌కుమార్ సంచలన నిర్ణయం
  • 14మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
  • 17కి చేరిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల సంఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu karnataka
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షకు ఒక్కరోజు ముందు స్పీకర్ రమేష్‌కుమార్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆదివారం ప్రకటన జారీచేశారు. రెబెల్స్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని, వారిని సభలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
కుమారస్వామి ప్రభుత్వం పతనమైన మరుసటి రోజే స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం మరో 14మందిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 17కి చేరింది. వీరిలో ముగ్గురు జేడీఎస్, 14మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత శాసనసభ కొనసాగినంత కాలం వారిపై నిషేధం అమల్లో ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు.

సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు వీరే..
బీసీ పాటిల్, ఆనంద్‌సింగ్, ప్రతాప్ పాటిల్, మునిరత్నం, బసవరాజు, ఎస్టీ సోమశేఖర్, ఎంటీబీ నాగరాజు, రోషన్ బేగ్, శివరాం హెబ్బెర్, సుధాకర్, విశ్వనాథ్, గోపాలయ్య, నారాయణగౌడ్, శ్రీమంత్ పాటిల్,

స్పీకర్ తాజా నిర్ణయంతో కర్ణాటక విధానసభలో సభ్యుల సంఖ్య 207కి చేరింది. దీంతో సభలో మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ప్రస్తుతం సభలో బీజేపీకి 105, కాంగ్రెస్-జేడీఎస్‌కు 99, ముగ్గురు స్వతంత్య అభ్యర్థులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.