యాప్నగరం

క్వారంటైన్‌తో ఒత్తిడికి గురై బాలుడి ఆత్మహత్య

హోమ్ క్వారంటైన్ కారణంగా బయటకి వెళ్లడానికి అనుమతించకపోవడంతో 15 ఏళ్ల ఓ బాలుడు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 9 Jul 2020, 12:06 am
రోనా మహమ్మారి మనిషి జీవితంతో ఆటలాడుకుంటోంది. లాక్‌డౌన్‌తో ఆటాపాటలు లేకుండా ఇంటికే పరిమితం కావడంతో చిన్నారుల్లో విపరీత ప్రవర్తన వస్తోంది. ఇక వైరస్ బారిన పడి క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే వారి పరిస్థితి మాటల్లో చెప్పలేనివిధంగా ఉంది. 14 నుంచి 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో పిల్లలు పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.
Samayam Telugu నమూనా చిత్రం
Boy commits suicide after depression with home quarantine in Karnataka


హోమ్ క్వారంటైన్‌లో ఉన్న 15 ఏళ్ల బాలుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది.

ఉడిపి జిల్లా సాలిగ్రామకు చెందిన ఓ మహిళ ఇళ్లలో ప‌ని మ‌నిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే.. ఆమె ప‌ని చేస్తున్న ఇంట్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఆమెతో పాటు 15 ఏళ్ల ఆమె కుమారుడిని కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. కోటాలో ఉండి పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు లాక్‌డౌన్ విధించడంతో తల్లి దగ్గరకు వచ్చేశాడు.

హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆ బాలుడిని బయటకు వెళ్లడానికి అనుమతించకపోవడంతో కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. అతడి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. ఫలితాలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read: ఆ మరణం.. ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకం

Don't Miss: కొవిడ్ యోధులకు వైరస్ సోకకుండా రక్షణ కవచం.. ఎయిమ్స్ ఆవిష్కరణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.