ఓ 15 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోయిందంటూ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులకి విచారణలో తెలిసిన వాస్తవాలు షాక్కి గురిచేశాయి. బాలిక ఆచూకీ వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకి ఆ ఇంటి దొంగని పట్టుకునే అవకాశం కూడా దొరికింది. నవీ ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి. బజార్పేట్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్, అతడి భార్య మే 9వ తేదీన కూతురిని ఇంట్లోనే వుంచి బయటికెళ్లి వచ్చేలోగా ఇంట్లోని కప్ బోర్డులో వున్న రూ.1.76 లక్షల విలువైన 7 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇధిలావుండగా మే 23వ తేదీన అతడి 15 ఏళ్ల కూతురు కనిపించకుండాపోయింది. డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అమ్మాయి చదువుతున్న స్కూల్కి వెళ్లి విచారించారు. ఆమె ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న సందర్భంలోనే.. ఆమెకి కాలేజీకి వెళ్తున్న ఓ 20 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ వున్నాడని.. ఇటీవలే అతడు ఓ బైక్ కొన్నాడని తెలిసింది. పైగా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆర్థికంగా అంత వున్న వాడు కూడా కాదని తెలుసుకున్న పోలీసులు అతడి వేటలో పడ్డారు.
ఈ క్రమంలోనే మే 24వ తేదీన ఉదయమే ఇంటికి తిరిగొచ్చిన బాలిక.. తన తల్లిదండ్రులకి ఓ కొత్త కథనం వినిపించింది. అన్నయ్యతో గొడవపడిన కారణంగానే తాను ఇల్లు వదిలి వెళ్లానని, ఆ రోజు రాత్రంతా కర్జాత్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్పై గడిపానని చెప్పింది. అయితే ఇంట్లో అమ్మానాన్నలకి చెప్పకుండా వెళ్లాను కదా అని తన తప్పు తాను తెలుసుకుని ఇంటికి తిరిగొచ్చానని నమ్మించింది. ఇదిలావుండగానే అదే రోజు సాయంత్రం పన్వెల్ ప్రాంతంలో ఆ బాలిక బాయ్ఫ్రెండ్ని పట్టుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా వాస్తవాలన్నీ వెల్లడించాడు. ఆ అమ్మాయి ఇంట్లో చోరీ చేసిన ఆభరణాలు తనకే తెచ్చి ఇచ్చిందని.. ఆ డబ్బుతోనే బైక్ కొన్నట్టుగా పోలీసులకి తెలిపాడు. అప్పుడు తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ బాలికని విచారించారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్తో స్పోర్ట్స్ బైక్పై షికార్లు కొట్టాలనే కోరికతో తానే ఆ నగలు చోరీ చేసి అతడికి ఇచ్చినట్టు విచారణలో అంగీకరించింది ఆ బాలిక. అయితే, వాటిని కొనుగోలు చేసిన ఓ కృత్రిమ నగల వ్యాపారి తమకి రూ.85,000 మాత్రమే ఇచ్చాడని వివరించింది. ఆ నగలని అమ్మిపెట్టేందుకు అతడికి సహకరించిన స్నేహితులు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఆ బాలికని జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచారు. బాలిక బాయ్ ఫ్రెండ్ అమ్మిన నగలని సైతం తిరిగి స్వాధీనపర్చుకున్నారు.
ఈ క్రమంలోనే మే 24వ తేదీన ఉదయమే ఇంటికి తిరిగొచ్చిన బాలిక.. తన తల్లిదండ్రులకి ఓ కొత్త కథనం వినిపించింది. అన్నయ్యతో గొడవపడిన కారణంగానే తాను ఇల్లు వదిలి వెళ్లానని, ఆ రోజు రాత్రంతా కర్జాత్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్పై గడిపానని చెప్పింది. అయితే ఇంట్లో అమ్మానాన్నలకి చెప్పకుండా వెళ్లాను కదా అని తన తప్పు తాను తెలుసుకుని ఇంటికి తిరిగొచ్చానని నమ్మించింది. ఇదిలావుండగానే అదే రోజు సాయంత్రం పన్వెల్ ప్రాంతంలో ఆ బాలిక బాయ్ఫ్రెండ్ని పట్టుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా వాస్తవాలన్నీ వెల్లడించాడు. ఆ అమ్మాయి ఇంట్లో చోరీ చేసిన ఆభరణాలు తనకే తెచ్చి ఇచ్చిందని.. ఆ డబ్బుతోనే బైక్ కొన్నట్టుగా పోలీసులకి తెలిపాడు. అప్పుడు తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ బాలికని విచారించారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్తో స్పోర్ట్స్ బైక్పై షికార్లు కొట్టాలనే కోరికతో తానే ఆ నగలు చోరీ చేసి అతడికి ఇచ్చినట్టు విచారణలో అంగీకరించింది ఆ బాలిక. అయితే, వాటిని కొనుగోలు చేసిన ఓ కృత్రిమ నగల వ్యాపారి తమకి రూ.85,000 మాత్రమే ఇచ్చాడని వివరించింది. ఆ నగలని అమ్మిపెట్టేందుకు అతడికి సహకరించిన స్నేహితులు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఆ బాలికని జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచారు. బాలిక బాయ్ ఫ్రెండ్ అమ్మిన నగలని సైతం తిరిగి స్వాధీనపర్చుకున్నారు.