తల్లిని కొట్టాడని 16 ఏళ్ల ఓ అమ్మాయి తన తండ్రిని కొట్టి చంపింది. తాగొచ్చి దుర్భాషలాడుతూ తల్లిని హింసిస్తుంటే.. చూస్తూ ఉండలేకపోయింది. బట్టలు ఉతికేందుకు ఉపయోగించే కర్రతో తండ్రి తలపై కసిదీరా చితకబాదింది. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి తనను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భోపాల్లో నివాసం ఉంటున్న 45 మద్యానికి బానిసయ్యాడు. పెద్ద కొడుకు సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. అతడు ఏ పని చేయకుండా నిత్యం తాగుతూ తన భార్యను హింసిస్తున్నాడు. తాగొచ్చి నోటికొచ్చినట్లు తిడుతూ, కొడుతూ నరకం చూపిస్తున్నాడు. కుటుంబ బాధ్యతలు కూడా మరచిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు.
బుధవారం (అక్టోబర్ 21) సాయంత్రం 6.30 గంటల సమయంలో ఎప్పటిలాగే ఆ తండ్రి బాగా తాగి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో తల్లీబిడ్డలిద్దరూ తమ పెద్ద కొడుకు పెళ్లి చేయాలనే విషయం గురించి చర్చిస్తున్నారు. ఇంటికి వస్తూనే ఆ తండ్రి వాళ్లతో గొడవకు దిగాడు. భార్యను తీవ్రంగా దూషిస్తూ కొట్టడం మొదలుపెట్టాడు. తల్లి బాధ చూసి అక్కడే ఉన్న కూతురుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే ఉన్న ఓ కర్ర తీసుకొని తండ్రి తలపై కొట్టింది.
తండ్రిపై కోపంతో ఆ అమ్మాయి రక్తం వస్తున్నా ఆగకుండా కర్రతో చితకబాదింది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే సంప్రదాయ కర్ర (లోహంగి) అది. దాని చివరన ఉండే ఇనుప రింగ్స్ కారణంగా బాధితుడి తల చిధ్రమైంది. దీంతో అతడు నొప్పికి విలవిల్లాడుతూ అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు.
ఆ తర్వాత ఆ బాలిక 100 నెంబరుకు ఫోన్ చేసి తండ్రిని తానే చంపినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాలికపై హత్య కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక కావడంతో ఆమెను బాలల శిక్షా శిబిరానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
Must Read:
★ ఆక్స్ఫర్డ్ ట్రయల్స్: మరణించిన ఆ వాలంటీర్కు టీకా వేయలేదు!
★ కరోనాతో కంటిచూపు కోల్పోయిన అమ్మాయి.. దేశంలో తొలి కేసు
★ రూ.500కే కరోనా టెస్ట్.. ఇక మరింత సులభం
భోపాల్లో నివాసం ఉంటున్న 45 మద్యానికి బానిసయ్యాడు. పెద్ద కొడుకు సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. అతడు ఏ పని చేయకుండా నిత్యం తాగుతూ తన భార్యను హింసిస్తున్నాడు. తాగొచ్చి నోటికొచ్చినట్లు తిడుతూ, కొడుతూ నరకం చూపిస్తున్నాడు. కుటుంబ బాధ్యతలు కూడా మరచిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు.
బుధవారం (అక్టోబర్ 21) సాయంత్రం 6.30 గంటల సమయంలో ఎప్పటిలాగే ఆ తండ్రి బాగా తాగి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో తల్లీబిడ్డలిద్దరూ తమ పెద్ద కొడుకు పెళ్లి చేయాలనే విషయం గురించి చర్చిస్తున్నారు. ఇంటికి వస్తూనే ఆ తండ్రి వాళ్లతో గొడవకు దిగాడు. భార్యను తీవ్రంగా దూషిస్తూ కొట్టడం మొదలుపెట్టాడు. తల్లి బాధ చూసి అక్కడే ఉన్న కూతురుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే ఉన్న ఓ కర్ర తీసుకొని తండ్రి తలపై కొట్టింది.
తండ్రిపై కోపంతో ఆ అమ్మాయి రక్తం వస్తున్నా ఆగకుండా కర్రతో చితకబాదింది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే సంప్రదాయ కర్ర (లోహంగి) అది. దాని చివరన ఉండే ఇనుప రింగ్స్ కారణంగా బాధితుడి తల చిధ్రమైంది. దీంతో అతడు నొప్పికి విలవిల్లాడుతూ అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు.
ఆ తర్వాత ఆ బాలిక 100 నెంబరుకు ఫోన్ చేసి తండ్రిని తానే చంపినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాలికపై హత్య కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక కావడంతో ఆమెను బాలల శిక్షా శిబిరానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
Must Read:
★ ఆక్స్ఫర్డ్ ట్రయల్స్: మరణించిన ఆ వాలంటీర్కు టీకా వేయలేదు!
★ కరోనాతో కంటిచూపు కోల్పోయిన అమ్మాయి.. దేశంలో తొలి కేసు
★ రూ.500కే కరోనా టెస్ట్.. ఇక మరింత సులభం