యాప్నగరం

వరదల బీభత్సం.. 153 మంది మృతి!

బిహార్‌ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో బిహార్‌‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బిహార్‌లోని 17 జిల్లాలు వరదల బారిన పడ్డాయి..

TNN 19 Aug 2017, 12:13 pm
బిహార్‌ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా కోసీ, మహానంద నదుల్లో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో బిహార్‌‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బిహార్‌లోని 17 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదల కారణంగా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 153 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అరారియా, పశ్చిమ్‌ చంపారన్‌ జిల్లాల్లో వరదల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే 55 మంది మరణించారు. ఈ 17 జిల్లాల పరిధిలో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద బాధితుల కష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
Samayam Telugu 17 districts affected death toll mounts to 153 in bihar floods
వరదల బీభత్సం.. 153 మంది మృతి!


వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి 28 బృందాలకు చెందిన 1,152 మంది సిబ్బంది, ఆర్మీ నుంచి 2,228 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బోట్‌లో శనివారం మరో శిశువు జన్మించింది. గోపాల్‌గంజ్ జిల్లాలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా నెలలు నిండిన గర్భిణి పడవలోనే ప్రసవించింది. బుధవారం మధుబని జిల్లాలోనూ ఇలాగే ఓ మహిళ పడవలోనే శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పాట్నా, గయా, భగల్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో శనివారం (ఆగస్టు 19) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.