యాప్నగరం

Azadi Ka Amrit Mahotsav వేడుకలు.. మళ్లీ పట్టాలెక్కనున్న 1855 నాటి పురాతన రైలు

తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ ట్రెయిన్ నడవబోతోంది. ట్రెయిన్ ట్రయల్ రన్‌ను రైల్వే శాఖ నిర్వహించింది. అయితే ఈ లోకో ట్రైయిన్‌న్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 Aug 2022, 6:53 am

ప్రధానాంశాలు:

  • ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌‌ వేడుకలు
  • రైల్వేశాఖ కూడా భాగస్వామ్యం అవుతోంది
  • ఈ నెల 15న పట్టాలెక్కనున్న EIR-21 రైలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu EIR-21 Train
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌‌ (Azadi Ka Amrit Mahotsav)ను ఘనంగా నిర్వహిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా రైల్వేశాఖ కూడా భాగస్వామ్యం అవుతోంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న పట్టాలెక్కించనున్నారు. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ ట్రెయిన్ నడవబోతోంది. దీనికి సంబంధించి రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ ట్రెయిన్ ట్రయల్ రన్‌ను రైల్వే శాఖ నిర్వహించింది.
ఈ EIR-21 వర్కింగ్ స్టీమ్ లోకోమోటివ్‌తో నడుస్తుంది.. అతి పురాతనమైంది. 1855లో ఈ రైలును ఇంగ్లండ్‌లో తయారుచేశారు. బ్రిటీష్ పాలనలో 1909 వరకు ఈ రైలును అధికారులు నడిపించారు. ఈ లోకో ట్రైయిన్‌న్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో నడిపించేవారు. లోకో వర్క్స్, పెరంబూర్ 1909లో సర్వీస్ నుంచి తప్పుకున్న తర్వాత 2010లో స్టీమ్ లోకోను పునరుద్ధరించారు. ఈ రైలు పునరుద్ధరణ నుంచి ప్రతి సంవత్సరం హెరిటేజ్ రన్‌ నడుస్తోంది.
అయితే స్వాతంత్ర్యం వచ్చాక ఈ రైలును హౌరాలోని జమాల్‌పూర్‌లో ప్రజలు చూసేందుకు ఉంచారు. ప్రపంచంలోని ఇది అతి పురాతన రైలు అని చెప్పడానికి దీనిని ప్రదర్శన కోసం హౌరాకు ఈ రైలును తరలించారు. అయితే ప్రస్తుతం చెన్నై మెట్రో సిటీ పెరంబూర్ లోకోమోటివ్ వర్క్స్‌లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రెయిన్‌ను గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో బయటకు తీసుకువచ్చి చరిత్రను ప్రజలకు చాటి చెప్పేందుకు పట్టాలెక్కిస్తుంటారు. EIR 21 GPS ఆధారిత స్పీడోమీటర్ వంటి ఆధునిక సాంకేతికతలకు కూడా అనుగుణంగా ఉంటుందట.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.