యాప్నగరం

సిమెంట్ బస్తాల లారీ బోల్తా... 19 మంది దుర్మరణం

సిమెంట్ లోడ్‌తో వెళుతోన్న ఓ భారీ ట్రక్ బోల్తాపడిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో 16 మంది కూలీలు కాగా, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Samayam Telugu 20 May 2018, 9:55 am
గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సిమెంట్ లోడ్‌తో వెళుతోన్న ఓ భారీ ట్రక్ బోల్తాపడిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో 16 మంది కూలీలు కాగా, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. అహ్మదాబాద్‌కు 170 కిలోమీటర్ల దూరంలోని భవ్‌నగర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భవ్‌నగర్ పోర్టు నుంచి సిమెంట్ లోడుతో వేగంగా వస్తున్న ట్రక్, జాతీయ రహదారిపై మలుపు తిరిగినప్పుడు అదుపుతప్పి బోల్తా పడింది. వాహనాన్ని అదుపుచేయలేకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి వాహనంలో 25 మంది కూలీలు ఉన్నట్టు అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అశరీ తెలిపారు. శనివారం ఉదయమే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆయన తెలియజేశారు.
Samayam Telugu గుజరాత్ రోడ్డు ప్రమాదం


ఈ ప్రమాదంలో 18 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో 12 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులే కావడం బాధాకరం. క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్‌లో చేర్చించారు. వాహనం వేగంగా నడుపుతూ మలుపు వద్ద నియంత్రించలేకపోవడంతో ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు, అతడి ఆచూకీ కోసం ఓ బృందాన్ని ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.