యాప్నగరం

50 ఏళ్లు జైల్లో పెట్టండి కానీ ఉరిశిక్ష విధించొద్దు

‘నన్ను 25 ఏళ్లు, 50 ఏళ్లు జైల్లో పెట్టండి కానీ ఉరిశిక్ష మాత్రం విధించొద్దు’ అంటూ 1993 ముంబై వరసు

Samayam Telugu 21 Jun 2017, 2:58 pm
‘నన్ను 25 ఏళ్లు, 50 ఏళ్లు జైల్లో పెట్టండి కానీ ఉరిశిక్ష మాత్రం విధించొద్దు’ అంటూ 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుల్లో ఒకరైన ఫిరోజ్ ఖాన్ టాడా కోర్టును వేడుకున్నాడు. ఈ పేలుళ్లకు తనకేలాంటి సంబంధం లేదని, తనను కుట్రపూరితంగా ఇరికించారని తెలిపిన ఫిరోజ్.. టాడా కోర్టు జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Samayam Telugu 1993 mumbai bomb blasts convict firoz pleads not to give death punishment slapped with rs 200 fine
50 ఏళ్లు జైల్లో పెట్టండి కానీ ఉరిశిక్ష విధించొద్దు


‘నన్ను 25-50 ఏళ్లు జైల్లో పెట్టండి. పెరోల్ ఇవ్వొద్దు. లీవులు కూడా ఇవ్వొద్దు. జీవితాంతం జైల్లో పెట్టండి. కానీ ఉరిశిక్ష మాత్రం విధించొద్దు. నా పిల్లలకు నేను బతికున్నానని తెలిస్తే చాలు’ అని 50 ఫిరోజ్ ఖాన్ జడ్జీ జీఏ సనప్ ను వేడుకున్నాడు. ఫిరోజ్ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని అతని తరఫున వాదిస్తున్న లాయర్ ప్రత్యక్ష సాక్షులకు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే జడ్జి సాక్షులను విచారించలేదు. కానీ ఫిరోజ్ ఖాన్ కు రూ.2వేల జరిమానా విధించారు.

ముంబై పేలుళ్ల కేసులో నిందితులైన అబూ సలేం వంటి ఆరుగురి దోషుల్లో ఫిరోజ్ ఖాన్ ఒకరు. ఈ కేసులో తాను అరెస్టు అయినప్పుడు 40ఏళ్లు అని.. తనకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ముంబై పేలుళ్లకు సంబంధించి ఆయుధసామాగ్రిని దాచిపెట్టడంతో పాటు తీవ్రవాద కార్యకలాపాలకు కుట్రపన్నాడన్న అభియోగాలు రుజువు కావడంతో ఫిరోజ్ కు శిక్షపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.