యాప్నగరం

ముంబై పేలుళ్ల నిందితుడి ఆకస్మిక మృతి

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు ముస్తఫ దొస్స బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు

Samayam Telugu 28 Jun 2017, 3:39 pm
1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు ముస్తఫ దొస్స బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఛాతి నొప్పితో బాధపుడుతున్న ముస్తఫను ముంబైలోని స్థానిక జేజే ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మధ్యాహ్నాం 2గంటలకకు గుండెపోటుతో మృతి చెందాడు. ముస్తఫ ఛాతినొప్పి, అధిక ఒత్తిడి, మధుమేహం, ఇన్ ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు జేజే ఆసుపత్రి వైద్యులు టీపీ లహెనే వెల్లడించారు.
Samayam Telugu 1993 mumbai serial blasts convict mustafa dossa dies of cardiac arrest
ముంబై పేలుళ్ల నిందితుడి ఆకస్మిక మృతి


ముంబై వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినవాళ్లలో ముస్తఫ ఒకరని.. అతనికి ఉరిశిక్ష విధించాలని సీబీఐ మంగళవారం నాడు కోర్టును కోరింది. ఈ కేసులో ఉరితీసిన యాకుబ్ మమెన్ కంటే ముస్తఫ ఎంతో ప్రమాదకారి అంటూ వ్యాఖ్యానించింది.


ముంబై బాంబు పేలుళ్ల కేసులో జూన్ 16న టాడా కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఇందులో అండర్ వరల్డ్ డాన్ అబు సలేంతోపాటు ముస్తఫ కూడా ఉన్నాడు. ఈ ఐదుగురిపై హత్యానేరం, కుట్ర వంటి కేసులు నమోదు కాగా.. ఆరో నిందితుడు సిద్దిఖీపై టాడా కింద కేసు నమోదైంది.

1993 మార్చి12న ముంబైలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.