యాప్నగరం

గోవాలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ.. పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి ఇద్దరు నేతలు..

Samayam Telugu 16 Oct 2018, 3:30 pm
గోవాలో ఊహాగానాలు నిజమయ్యాయి. కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇస్తూ.. దయానంద్ సోప్టే, సుభాష్ సిరోద్కర్‌లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. సోమవారం రాత్రి గోవా నుంచి ఢిల్లీ చేరుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆ లేఖల్ని ఫ్యాక్స్‌లో పంపగా.. స్పీకర్ కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Goa.


ఢిల్లీలో ఈ ఇద్దరు నేతలు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలిశారు. దాదాపు గంటపాటూ ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ సాయంత్రం షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరే కాదు మరో.. ఇద్దరు ముగ్గురు కూడా త్వరలో బీజేపీలోకి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే.. కాంగ్రెస్‌‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే.

పదవులకు రాజీనామా చేసిన వీరిద్దరికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సోప్టేకు మోపా ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా.. సిరోద్కర్‌కు గోవా టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమించబోతున్నారట. 2017లో జరిగిన ఎన్నికల్లో.. సీఎంగా పనిచేసిన లక్ష్మీకాంత్ పర్సేకర్‌పై దయానంద్ 7,119 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక సుభాష్ శిరోద్కర్ శిరోడా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో.. కాంగ్రెస్ పార్టీ బలం 16 నుంచి 14కు పడిపోయింది. ఎన్నికల్లో బీజేపీకి 14 సీట్లు రాగా.. మరో ముగ్గురి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలిచారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.