యాప్నగరం

పాప ప్రాణం బలి తీసుకున్న పిల్లి

ఓ పిల్లి రెండేళ్ల పాప ప్రాణాలను బలి తీసుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు..

Samayam Telugu 6 Sep 2020, 7:11 pm
పిల్లి ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని అయనవరం ప్రాంతంలో నివసిస్తున్న దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. శనివారం (సెప్టెంబర్ 5) సాయంత్రం తన ఆటపాటలతో సందడి చేసిన చిన్నారి అంతలోనే నిద్రలోకి జారుకుంది. ఆ చిన్నారిని గదిలో అక్కడే ఓ చోట పడుకోబెట్టి తల్లిదండ్రులు వేరే పనిలో నిమగ్నమయ్యారు. ఆ పాపను పడుకోబెట్టిన చోటే స్టాండ్‌పై టీవీ ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Cat kills 2 years old baby in Chennai


ఇంతలో ఓ పిల్లి ఆ ఇంట్లోకి దూరింది. అటూ ఇటూ తిరిగి ఆ టీవీ స్టాండ్‌పై దూకింది. దీంతో అక్కడే నిద్ర పోతున్న పాపపై టీవీ పడిపోయింది. టీవీ పడటంతో పాప తలకు తీవ్ర గాయమైంది. తల్లిదండ్రుల కళ్ల ముందే ఇదంతా జరిగింది.

తీవ్రంగా గాయపడిన పాపను తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక కిల్‌పాక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అంతసేపటివరకు తమ కళ్ల ముందే ఆడుకున్నపాప ఇకలేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని వారు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: శ్రీశైలంలో మళ్లీ ప్రమాదం.. ఈసారి మాక్ డ్రిల్, కానీ వణికిపోయిన సిబ్బంది

Must Read: కరోనా పాజిటివ్ యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం.. హాస్పిటల్‌కు తీసుకెళ్తూ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.