యాప్నగరం

లోయలో పడ్డ మినీ బస్సు.. 20 మంది మృతి

జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 6 Oct 2018, 4:03 pm
మ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది మరణించగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై శనివారం (అక్టోబర్ 6) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఓవర్ లోడ్, అధిక వేగం కారణంగా బస్సు డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఓ మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు 200 అడుగుల లోయలోకి పడిపోయింది. దీంతో డ్రైవర్‌తో పాటు 20 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
Samayam Telugu mini bus


మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయ చర్యల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

లోయలో పడిన మినీ బస్సు


ప్రమాదం జరిగిన ప్రదేశంలో కొండ వాలు ఎక్కువగా ఉండటంతో సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు రామ్‌బన్ నుంచి బనిహాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.