యాప్నగరం

జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు..

ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై 20 యుద్ధ విమానాలు ల్యాండ్‌ కానున్నాయి. శుక్రవారం (అక్టోబర్ 20) నుంచి ఈ రహదారిని మూసిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌‌లో అక్టోబర్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అత్యవసర సమయాల్లో రోడ్లపై యుద్ధ విమానాలను ల్యాండ్‌ చేసే అంశాన్ని పరీక్షించనున్నారు.

TNN 20 Oct 2017, 2:37 pm
ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై 20 యుద్ధ విమానాలు ల్యాండ్‌ కానున్నాయి. శుక్రవారం (అక్టోబర్ 20) నుంచి ఈ రహదారిని మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌‌లోని ఉన్నావ్ జిల్లా బంగర్‌మౌ ప్రాంతంలో అక్టోబర్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అత్యవసర సమయాల్లో రోడ్లపై యుద్ధ విమానాలను ల్యాండ్‌ చేసే అంశాన్ని పరీక్షించనున్నారు. సుఖోయ్‌ విమానాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.
Samayam Telugu 20 iaf aircraft to land on lucknow agra expressway on october 24
జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు..


‘విపత్తులు, యుద్ధం సంభవించినప్పుడు విమానాల ద్వారా సహాయక చర్యలు ఎలా కొనసాగుతాయో ఈ డ్రిల్‌ ద్వారా చూపించనున్నాం. ఏఎన్‌-32 ప్రయాణికుల విమానంతో పాటు మిరేజ్‌ 2000, సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి’ అని ఐఏఎఫ్‌ అధికారి గార్గి మాలిక్‌ సిన్హా తెలిపారు.

దేశంలో తొలిసారిగా ప్రయాణికుల విమానాన్ని సాధారణ రహదారులపై ల్యాండింగ్‌ చేయించనున్నారు. స్విట్జర్లాండ్‌ లాంటి దేశాల్లో ఎమర్జెన్సీ సమయాల్లో ఇప్పటికే ఇలాంటివి చేస్తున్నారు.

Also Read: విమానాల కోసం సిద్ధమవుతోన్న 12 హైవేలు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.