యాప్నగరం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగలింది..

TNN 16 May 2017, 7:42 pm
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగలింది. బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక దళం, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమైనట్లు సీఆర్‌పీఎఫ్‌ ఐజీ మీడియాకు తెలిపారు. మరో 8 మంది మావోలను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు ఎదురుపడిన మావోయిస్టులు కోబ్రా యూనిఫాంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 350 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు.
Samayam Telugu 20 naxals killed in bijapur encounter
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం


సుక్మా దాడి ద్వారా పెద్ద సంఖ్యలో జవాన్లను బలిగొన్న మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సీఆర్‌పీఎఫ్‌ చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా సీఆర్‌పీఎఫ్‌ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 3 రోజులుగా కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.