యాప్నగరం

దేశంలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న 201‘8’

2018లో రాజకీయల పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ చివరి అంకెపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. సెమీస్‌లో పై చేయి సాధించడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని భావిస్తున్నాయి.

TNN 1 Jan 2018, 1:57 pm
కొత్త సంవత్సరం వచ్చేసింది. మిగతా రంగాల మాట ఎలా వున్నా.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో పొలిటికల్ హీట్ పెరగనుంది. గత ఏడాది ఆరంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది. ఉత్తర ప్రదేశ్‌లో భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ.. గోవా, ఉత్తర్‌ఖండ్, మణిపూర్‌లలోనూ అధికారంలో వచ్చింది. కానీ ఏడాది చివరి నాటికి వచ్చేసరికి బీజేపీ ఒత్తిడిలో పడిపోయింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కమలం పార్టీ కష్టం మీద నెగ్గింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన పోటీ ఇచ్చింది. మరోవైపు హిమాచల్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ ఘన విజయం సాధించింది.
Samayam Telugu 2018 to witness elections in 8 states set tone for 2019 lok sabha elections
దేశంలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న 201‘8’


ఇక 2018 విషయానికి వస్తే.. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు.. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 8 రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలను సెమీఫైనల్‌తో పోల్చవచ్చు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి శతథా ప్రయత్నిస్తోంది. దక్షిణాదిన విస్తరించాలనే యోచనలో ఉన్న బీజేపీ.. కన్నడ నాట తిరిగి కమల వికాసం కోసం పాకులాడుతోంది.


ఈ 8 రాష్ట్రాల ఎన్నికల్లో మేఘాలయ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడనున్నాయి. మేఘాలయలో బీజేపీ మిత్రపక్షం ఎన్‌పీపీ కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారుగా ఉంది. దీంతో ఈ ముఖాముఖిలో గెలిచిన పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సానుకూల పరిణామాలు ఏర్పడవచ్చు. కాబట్టి.. కర్ణాటకను తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు.. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరోసారి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ‘8’పై దృష్టి పెట్టడం ద్వారా కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది.

రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది అగ్నిపరీక్షగానే చెప్పుకోవచ్చు. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడంతోపాటు.. రాజస్థాన్, మరో రాష్ట్రంలో హస్తం గెలిస్తే.. 2019 ఎన్నికలు రంజుగా మారే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.