యాప్నగరం

లోయలో పడ్డ రెండు బస్సులు.. 9 మంది మృతి, 46 మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో రెండు బస్సులు లోయలో బోల్తాపడ్డాయి.

Samayam Telugu 25 Nov 2018, 10:32 pm
హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. దాదుహు ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40 మంది ప్రయాణికులతో రేణుకాజీ నుంచి నాహాన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Samayam Telugu Untitled12


ప్రమాద వార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నహాన్ మెడికల్ కాలేజ్‌కు తరలించారని ఏఎస్పీ విరేంద్ర సింగ్ తెలిపారని ‘పీటీఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. అతి వేగం వల్లే బస్సు ప్రమాదానికి గురైందని ప్రాథమిక విచారణలో తెలిసింది.

మరో ఘటనలో 21 మంది గాయాలు: హిమాచల్ ప్రదేశ్‌లో మరో టూరిస్టు బస్సు కూడా ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి షిమ్లా వెళ్తున్న బస్సు కైరీ నల్లా‌కు చేరగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఘటనా స్థలికి చేరి పోలీసుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.