యాప్నగరం

ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 223 కేసులు

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 223 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3738కి చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.

Samayam Telugu 1 May 2020, 11:43 pm
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం (మే 1) ఒక్క రోజే ఢిల్లీలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3738కి చేరుకుంది. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 2,300 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.
Samayam Telugu నమూనా చిత్రం
Delhi Coronavirus


మరోవైపు కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 1100 మంది తమ ప్లాస్మాను ఇతర రోగులకు అందించేందుకు సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు. కరోనా రోగులకు చికిత్సలో తోడ్పడటానికి వారంతా ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరినట్లు వెల్లడించారు. వీరిలో 9 వేల మందికి పైగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 564 మంది కోలుకున్నారని అవ్ అగర్వాల్ తెలిపారు. రికవరీ రేటు 25.37 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

Also Read: లాక్‌డౌన్ 3: ఏమేం చేసుకోవచ్చు? వేటికి అనుమతి లేదు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.