యాప్నగరం

ఏపీలో ఘోర రైలు ప్రమాదం, 23మంది మృతి

జగ్దల్ పూర్ భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ 18448 రైలు పట్టాలు తప్పి 23 మంది మృతి చెందారు.

TNN 22 Jan 2017, 7:33 am
శనివారం అర్థరాత్రి జగ్దల్ పూర్ భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ 18448 రైలు పట్టాలు తప్పి 23 మంది మృతి చెందారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతుండగా రాత్రి 11 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్ తో సహా రైలులోని ఎనిమిది బోగిలు పట్టాలు తప్పడంతో 23మంది మృతి చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu 23 dead as train derails in ap late on saturday night
ఏపీలో ఘోర రైలు ప్రమాదం, 23మంది మృతి

ఎస్8, ఎస్9 బోగీలు మొత్తం దెబ్బతిన్నాయి. ఏసీ3టైర్, ఏసీ 2టైర్ బోగులు, జనరల్ బోగీలు, లగేజీ బోగి పట్టాలు తప్పాయి. నాలుగు అంబులెన్స్‌తో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలను రాయగఢ్ కలెక్టర్ పూనగ్ గుహ, సబ్ కలెక్టర్ మురళీధర్, రాయగఢ్ ఎస్పీ శివసుబ్రమణి, సీఆర్పీఎఫ్ కమాండెంట్ మనోజ్ కుమార్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రుల్లో గీతాంజలి మహంతి, నిలిమా మిశ్రో, భగవాన్ పరిస్థితి విషమంగా ఉంది. కోమటిపల్లికి చెందిన ఎం శంకర్ రావు, ఎస్ శ్రీనివాసరావుకు స్వల్పగాయాలయ్యాయి.

హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రకటించిన రైల్వేశాఖ
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రకటించింది. బంధువుల సమాచారం కోసం 06856-223400, 06856-223500, 09439741181, 09439741071, 07681878777, విజయనగరం రైల్వే స్టేషన్ హెల్ప్‌లైన్ నెంబర్లు 83331, 83332, 83333, 8334, 08922-221202, 08922-221206 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సుచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.