యాప్నగరం

ఇక నుంచి ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలే!

ఏసీల్లో ఇకపై కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలే ఉండాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ కంపెనీలకు సూచించింది. ఇంధన వనరుల పొదుపు, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 24 Jun 2018, 7:38 pm
సీల్లో ఇకపై కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలే ఉండాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ కంపెనీలకు సూచించింది. ఇంధన వనరుల పొదుపు, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో దీన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఏసీల్లో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ చొప్పున తగ్గిస్తే 6 శాతం విద్యుత్తను ఆదా చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.
Samayam Telugu metroheatcool_1446117070


ఓజోన్‌ పొరను దెబ్బతీసే గ్రీన్‌హౌస్‌ వాయువులు భారీగా వాతావరణంలోకి వెళ్తుండడంతో విద్యుత్‌ను ఆదా చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీసియన్సీ (BEE) కేంద్రానికి తెలిపింది. మానవశరీరం సగటు ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుందని, కానీ, వివిధ సంస్థల కార్యాలయాల్లో ఉష్ణోగ్రతలను 18 నుంచి 21 డిగ్రీల మధ్య ఉంచుతున్నారని తెలిపింది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏసీల్లో కనీస ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

జపాన్‌లో 28 డిగ్రీలే: కేంద్ర విద్యుత్త్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. కొన్ని హోటళ్లు ఉన్ని దుస్తులు, బ్లాంకెట్లను వినియోగించడం కోసం 18 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రత పెడుతున్నాయి. దీనివల్ల విద్యుత్తు చాలా ఖర్చవుతుంది. జపాన్ వంటి దేశాలు 28 డిగ్రీల ఉష్ణోగ్రతను తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రత పరిధిని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం ఎయిర్ కండీషనర్లలోనే కాకుండా, హోటళ్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా నిర్ధారిత ఉష్ణోగ్రతలు అమలు చేసేలా చూస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.