యాప్నగరం

ఆర్మీ ఆస్పత్రిలో కరోనా అలజడి.. 24 మందికి పాజిటివ్

దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఆర్మీలోనూ అలజడి రేపుతోంది. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో 24 మందికి వైరస్ సోకింది. ఐటీబీపీలో 45 మంది కరోనా బారినపడ్డారు.

Samayam Telugu 5 May 2020, 5:42 pm
సైన్యంలో కరోనా కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో 24 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వీరిలో సర్వీస్‌లో ఉన్నవారు, రిటైర్ అయినవారు ఉన్నారు. ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్న సైనిక ఉద్యోగులకు వైర‌స్ సోకిన‌ట్లు మంగళవారం (మే 5) అధికారులు వెల్లడించారు. వైర‌స్ సోకిన వారంద‌రినీ ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీ బేస్ ఆస్పత్రికి త‌ర‌లించినట్లు తెలిపారు. సామూహిక వ్యాప్తి (క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్) జ‌రిగిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఖండించారు.
Samayam Telugu నమూనా చిత్రం
Army Hospital


అటు ఐటీబీపీలోనూ కరోనా అలజడి రేపుతోంది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగానికి చెందిన 45 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇప్పటివరకు ఢిల్లీలోనే విధులు నిర్వర్తించినట్లు వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 195 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 46,433కు చేరుకుంది. కరోనా కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 1568 మంది మరణించారు. 12,727 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 27.41 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాక సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

Also Read: మే 7 నుంచి స్వదేశానికి భారతీయులు.. ప్రత్యేక విమానాలు, నౌకలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.