యాప్నగరం

బెంగాల్‌లో 250 కుక్కల మృతి.. ఇదేం వైరస్!

Parvovirus: పశ్చిమ బెంగాల్‌లో శునకాలు అనుమానాస్పదంగా మరణిస్తున్నాయి. వీటి మరణానికి వైరల్ వ్యాధే కారణమని భావిస్తున్నారు. మరణించిన కుక్కల నమూనాలను పరీక్షలకు పంపించారు.

Samayam Telugu 21 Feb 2021, 12:26 am
శ్చిమ బెంగాల్‌లో వీధి కుక్కల మృతి అలజడి రేపుతోంది. ఆ రాష్ట్రంలోని బంకురా జిల్లా విష్ణుపూర్ (Bishnupur)‌ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో 250 వీధి కుక్కలు మరణించాయి. స్థానిక అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం.. మంగళవారం (ఫిబ్రవరి 16) 62, బుధవారం 96 శునకాలు మరణించాయి. శుక్రవారం రాత్రి వరకు మరో 100కు పైగా శునకాలు మృతి చెందాయి. వీటిలో కొన్ని పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Dogs Suspected death in Bengal


శునకాలు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కుక్కల మృతికి వైరల్‌ ఇన్‌ఫెక్షనే కారణమై ఉంటుందని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు. మృతి చెందిన శునకాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం కోల్‌కతాకు పంపించారు.

పర్వో వైరస్ (Parvovirus) కారణంగానే ఆ మూగజీవాలు అకస్మాత్తుగా మరణిస్తుండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుక్కల్లో వ్యాప్తి చెందే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదని వారంటున్నారు. కుక్కల్లో ఈ వైరస్ ఒక దాని నుంచి మరొకదానికి తేలిగ్గా వ్యాపిస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ సమస్య విష్ణుపూర్‌కు మాత్రమే పరిమితమై ఉందని అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.