యాప్నగరం

యూపీలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

TNN 24 Nov 2017, 9:49 am
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పట్నా నుంచి గోవాకు వెళ్లే వాస్కోడిగామా- పట్నా ఎక్స్‌ప్రెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మాణిక్‌పూర్ రైల్వే స్టేషన్‌ నుంచి శుక్రవారం తెల్లవారు జామున బయలుదేరింది. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఉదయం 4.18 గంటలకు చిత్రకూట్‌ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో బిహార్‌కు చెందిన తండ్రి కొడుకులు ఉన్నట్లు చిత్రకూట్ ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఇద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలియజేశారు.
Samayam Telugu 3 dead 9 injured after train derails in uttar pradeshs chitrakoot
యూపీలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!


ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందేలా చూడాలని అన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందిస్తామని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు గురువారం ఉదయం లక్నో సమీపంలో ఓ పాసింజర్ రైలును బొలెరో వాహనం ఢీకొట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.