యాప్నగరం

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

TNN 14 Feb 2017, 8:17 pm
ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలోని హాజిన్ క్రాల్‌గుండ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని సమాచారం అందడంతో ఆర్మీ జవాన్లతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులోని ఎస్‌ఓజీ విభాగం చుట్టుముట్టింది.
Samayam Telugu 3 militants killed soldier injured in handwara
కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం


అయితే ఈ ఎన్‌కౌంటర్ ఓ ఆర్మీ జవాన్ స్వల్పంగా గాయపడ్డాడు. హాజిన్‌లో ఈరోజు ఉదయం కూడా ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ పోరులో ముగ్గరు ఆర్మీ జవాన్లు అమరులవగా.. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని ఆర్మీ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.