మహారాష్ట్రలోని భీమండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. పాతబడిన మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం (నవంబర్ 24) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరుకైన ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారినట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 2 బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఒకరి మృతి
మహారాష్ట్రలోని భీమండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. పాతబడిన మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
TNN 24 Nov 2017, 11:31 am