యాప్నగరం

బస్సు ప్రమాదం.. 32కు పెరిగిన మృతుల సంఖ్య

సవాయ్ మాధోపూర్ సమీపంలోని దుబి వద్ద వంతెన మీదుగా ప్రయాణిస్తోన్న బస్సు అదుపు తప్పి బనాస్ నదిలోకి దూసుకుపోయింది.

TNN 23 Dec 2017, 1:00 pm
శనివారం ఉదయం రాజస్థాన్‌లో సంభవించిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 32 కు చేరింది. సవాయ్ మాధోపూర్ సమీపంలోని దుబి వద్ద వంతెన మీదుగా ప్రయాణిస్తోన్న బస్సు అదుపు తప్పి బనాస్ నదిలోకి దూసుకుపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, అసోం రాష్ట్రాలకు చెందిన యాత్రికులు సవాయ్ మాధోపూర్ సమీపంలోని మలనా దేవి ఆలయానికి ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తోన్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపుతప్పడంతో 100 అడుగల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Samayam Telugu 32 killed as bus falls off bridge into river in sawai madhopur rajasthan
బస్సు ప్రమాదం.. 32కు పెరిగిన మృతుల సంఖ్య


ఇప్పటి వరకు 27 మృతదేహాలను గుర్తించామని, గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సవాయ్ మధోపూర్ ఎస్పీ మమన్ సింగ్ పేర్కొన్నారు. బస్సు మునిగిపోవడంతో డ్రైవర్‌తో సహా అందరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించినట్లు వెల్లడించారు. అలాగే పోస్ట్-మార్టం పూర్తయిన 10 మృతదేహాలను వారి కుటుంబం సభ్యులకు అందజేశామని తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు, అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.