యాప్నగరం

ఘోరాతి ఘోరం.. వీళ్లు మనుషులేనా?.. 50 కోతులకు విషమిచ్చి గోనెసంచిలో వేసి పైశాచికం

కర్నాటకలోని హసన్ జిల్లాలో కొందరు బరితెగించి ప్రవర్తించారు. కోతులకు విషం పెట్టి, పైగా గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. దీంతో 38 కోతులు మరణించాయి.

Samayam Telugu 29 Jul 2021, 9:31 pm
రానురాను మనుషుల్లో మానవత్వం నశించిపోతుందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనం. సాటి మనుషులతోనే కాదు మూగ జీవాలపై కూడా కొందరు అమానుషంగా ప్రవర్తిస్తూ సభ్యసమాజానికి మాయని మచ్చ తెచ్చిపెడుతున్నారు. కర్నాటకలోని హసన్ జిల్లాలో కొందరు దుర్మార్గులు బరితెగించి ప్రవర్తించారు. కోతులకు విషం పెట్టి వాటిని గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ దారుణ ఘటనలో 38 కోతులు మరణించాయి. హసన్ జిల్లాలోని చౌడనహళ్లి సమీపంలోని ఓ రోడ్డు పక్కన ఈ ఘటన జరిగింది.
Samayam Telugu Image


చౌడనహళ్లి గ్రామస్థులు గురువారం ఉదయం ఓ గోనె సంచిని చూశారు. దాన్ని తెరిచి చూడగా అందులో కోతులు విగత జీవులుగా కనిపించాయి. వాటన్నింటినీ బయటికి తీసి చూడగా మొత్తం 50 కోతులున్నాయి. వాటిలో 38 కోతులు ప్రాణాలు కోల్పోగా.. కొన ప్రాణాలతో ఉన్న వాటికి గ్రామస్తులు నీళ్లు తాగించారు. ఆ తర్వాత బ్రతికున్న కోతులను ఆస్పత్రికి తీసుకెళ్లిన స్థానికులు సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు.

దీంతో చనిపోయిన కోతులకు పోస్టుమార్టం నిర్వహించగా వాటికి విషం పెట్టడమే కాకుండా గోనె సంచిలో కుక్కి ఘోరాతి ఘోరంగా కొట్టారని ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ విషయంపై డిప్యూటీ కన్జర్వేటర్ అధికారి మాట్లాడుతూ... ‘దగ్గర్లో ఉన్న బేలూర్, సక్లేష్ పూర్‌లో చాలా కోతులున్నా వాటికి వచ్చే నష్టమేమీ లేదు. స్థానికులు వాటికి ప్రాణ నష్టాన్ని కలిగించరు. వాటి శరీర భాగాలను క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ కోతులను వేరే ప్రాంతంలో చంపేసి ఇక్కడ పడేసి ఉంటారు’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.