యాప్నగరం

కశ్మీర్ నుంచి ఢిల్లీలోకి ఉగ్రవాదులు.. ఐబీ హెచ్చరికలతో హైఅలర్ట్

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో అన్ని దేశాలూ తలమునకలై ఉంటే.. దాయాది పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోస్తోంది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది.

Samayam Telugu 22 Jun 2020, 10:28 am
దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. జమ్మూ కశ్మీర్ నుంచి నలుగురు ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మరికొందరు ఢిల్లీలో చొరబడేందుకు రోడ్డు మార్గంలో బస్సు, కారు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలు గుర్తించాయి. ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ఢిల్లీ స్పెషల్, క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటల్స్ ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
Samayam Telugu ఢిల్లీలో హైఅలర్ట్
terrorists sneaks into delhi


ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, రాజధానిలోకి వచ్చే అన్ని వాహానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రద్దీ మార్కెట్‌లు, హాస్పిటల్స్ వద్ద నిఘా పెంచి, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కూడా దాడులకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.