యాప్నగరం

మావోయిస్టుల మందుపాతర.. నలుగురు జవాన్ల మృతి

జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేశారు. ఎన్‌కౌంటర్‌గా బదులుగా ఈ భీకర దాడికి పాల్పడ్డారు.

Samayam Telugu 27 Oct 2018, 7:26 pm
మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. శనివారం (అక్టోబర్ 27) మధ్యాహ్నం బీజాపూర్‌లోని అవపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చివేశారు. దీంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్‌కు చెందిన ఓ ఏఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu Bijapur blast


యాంటీ-ల్యాండ్‌మైన్ వాహనం అయినప్పటికీ పేలుడు ధాటికి అది తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి జవాన్ల వాహనం గాల్లోకి ఎగిరి అల్లంత దూరాన ఎగిరి పడినట్లు సమాచారం. మావోయిస్టుల దాడి ఘటనలో గాయపడిన ఇద్దరు జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ పి సుందర్‌రాజ్ వెల్లడించారు.

శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు బదులుగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. మందుపాతర పేల్చిన మావోయిస్టుల కోసం పోలీసులు బీజాపూర్ అడవిని జల్లెడ పడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.