యాప్నగరం

కార్తీక పౌర్ణమి వేడుకల్లో తొక్కిసలాట

కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది వరకు గాయపడ్డారు. బిహార్‌లోని బెగుసరయ్‌లో గంగా నది సిమారియా ఘాట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు.

TNN 6 Nov 2017, 3:59 pm
కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది వరకు గాయపడ్డారు. బిహార్‌లోని బెగుసరయ్‌లో గంగా నది సిమారియా ఘాట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. ఆ సమయంలో ఘాట్‌ వద్ద ఏదో జరిగిందంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి. దీంతో ఆందోళన చెందిన భక్తులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Samayam Telugu 4 killed in bihars stampede during kartik purnima
కార్తీక పౌర్ణమి వేడుకల్లో తొక్కిసలాట


పవిత్ర కార్తీక పౌర్ణమి పండగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. కాశీ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు నదీ పరివాహక ప్రాంతాలు భక్తులతో సందడిగా మారిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.